
లింగంపేట, వెలుగు : అడవుల్లో వన్యప్రాణులను ఎవరైనా వేటాడితే కఠిన చర్యలు తప్పవని ఎల్లారెడ్డి ఫారెస్టు రేంజ్సెక్షన్ ఆఫీసర్ భాస్కర్ హెచ్చరించారు. ఆదివారం లింగంపేటలోని ఫారెస్టు క్వార్టర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని కొందరు వ్యక్తులు అటవీ జంతువులను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అటవీ జంతువులను వేటాడడం, అటవీ భూములను ఆక్రమించడం నేరమన్నారు. వన్యప్రాణులను వేటాడే వారిని పట్టుకునేందుకు ప్రత్యే క బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వన్యప్రాణులను ఎవరైనా వేటాడినట్లు 8500828618 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమావేశంలో మెంగారం బీట్ఆఫీసర్ఫర్వీనా తదితరులు పాల్గొన్నారు.